సూర్య‌, శివ‌.. అఫీషియ‌ల్‌

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

హీరో అజిత్‌తో వరసగా నాలుగు సినిమాలు చేసి, నాలుగు సినిమాలనూ సూపర్‌హిట్ చేసిన ఘనత దర్శకుడు శివకు దక్కుతుంది. ఒక స్టార్ హీరోతో వరసగా నాలుగు సినిమాలు చేయడ‌మ‌నేది ఈరోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అలాంటి శివ ఇప్పుడు తన తదుపరి సినిమాను అజిత్‌తో కాకుండా హీరో సూర్యతో చేసేందుకు రెడీ అవుతున్నారు. తమ అభిమాన హీరోతో ఓ టాప్ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నాడంటే అది అభిమానులు పండగ చేసుకునే వార్తే కదా.

సూర్య 39వ సినిమాగా స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సందర్భంగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఙానవేల్‌రాజా మాట్లాడుతూ ‘‘సూర్య, శివ కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే సూర్య అభిమానులకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఓ పండగే’ అన్నారు. ప్రస్తుతం సూర్య ‘శూరరై పోట్రు’ చిత్రం చేస్తున్నారు. ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సూర్య, శివ కాంబినేషన్ మూవీ ప్రారంభవువుతుందని తెలుస్తోంది.

More News

జగన్‌పై హత్యాయత్నం కేసు: తీవ్ర విషమంగా నిందితుడి ఆరోగ్యం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అనే యువకుడు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

సీక్వెల్‌కు సల్మాన్ రెడీ!

తమిళ్‌లో విక్రమ్ హీరోగా బాల దర్శకత్వంలో రూపొందిన 'సేతు' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ తెలుగులో 'శేషు'గా  రీమేక్ చేశారు.

కొత్త దర్శకుడితో చరణ్

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని పై క్లారిటీ లేదు.

లంకలో మారణహోమం మా పనే: ఐసిస్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే నాడు జరిగిన మారణహోమంలో మొత్తం 321 మంది తుదిశ్వాస విడవగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓటిమి పై గంభీర్ ఎమోషనల్!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది. అయితే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసింది.