సూర్య‌.. ఎందుక‌లా?

  • IndiaGlitz, [Monday,July 06 2020]

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. అయితే సూర్య గ‌త‌ సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్న హీరో సూర్య‌కు క‌రోనా బ్రేకులేసింది. సినిమాను సిద్ధం చేసిన సూర్య నెక్ట్స్ మూవీకి రెడీ అయిపోయాడు. ప్ర‌స్తుతం సూర్య రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. సింగం సిరీస్ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. దీనికి అరువా అనే టైటిల్‌ను అనుకున్నారు. త‌ర్వాత అసుర‌న్ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్‌తోనూ సినిమా చేయాల‌ని అనుకున్నాడు.

ఇప్పుడు సూర్య ప్లాన్ మారుస్తున్నాడంటూ సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల మేర‌కు ముందుగా వెట్రిమార‌న్ సినిమాను పూర్తి చేసి త‌ర్వాత హ‌రి సినిమాను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే చిత్రం జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి 'వాడివాస‌ల్‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. జ‌ల్లిక‌ట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఎంట్రీ ఇచ్చే గుమ్మాన్ని వాడివాస‌ల్ అంటారు. తెలుగు టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. సీఎస్‌.చెల్ల‌ప్ప అనే ర‌చ‌యిత రాసిన న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. దానికి సంబంధించిన హ‌క్కుల‌ను కూడా సూర్య అండ్ టీమ్ ద‌క్కించుకుంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అసుర‌న్ వంటి ర‌స్టిక్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెట్రిమార‌న్.. సూర్య సినిమాను కూడా ర‌స్టిక్‌గానే తెర‌కెక్కిస్తాడ‌ని టాక్‌.

More News

విజయ్ ఇంటికి పోలీసులు.. అర్థరాత్రి హైడ్రామా

కోలీవుడ్ స్టార్ విజయ్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు.. ఇల్లంతా గాలించారు. ఉన్నట్టుండి పోలీసులు రావడం సోదాలు నిర్వహిస్తుండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అవాక్కయ్యారు.

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే..

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు కావాలంటే గగనమే. చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు కానీ దొరికేది కాదు.

ఈ లక్షణాలుంటే మీకు కరోనా ఉన్నట్టే..

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అలాగే కరోనా లక్షణాల జాబితా కూడా పెరిగిపోతోంది.

రూట్ మారుస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మెగాభిమానుల‌ను మెప్పిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌.

సినీ నటికి కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారం..

ఓ ప్రైవేటు సంస్థకు సీఈవోగా ఓ బహుభాషా నటితో పరిచయం పెంచుకున్నాడో వ్యక్తి. ఆపై ఆమెకూ తమ కంపెనీలోనే ఉద్యోగం కల్సించాడు.