ఈనెల 9న 'మేము' మ్యూజిక్‌ ఫంక్షన్‌

  • IndiaGlitz, [Friday,November 06 2015]

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న మేము' చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సన్నితి ప్రొడక్షన్స్‌ అధినేత ప్రసాద్‌ సన్నితి- శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్‌ అధినేత తమటం కుమార్‌రెడ్డి ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు. పిశాచి' ఫేం అర్రోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వెన్నెలకంటి-సాహితి-చంద్రబోస్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. హైద్రాబాద్‌, హైటెక్‌ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికపై జరగనున్న ఈ ఆడియో వేడుకలో సూపర్‌స్టార్‌ సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి, చిత్ర దర్శకుడు పాండిరాజ్‌, సంగీత దర్శకుడు అర్రోల్‌ కొరెల్లి తదితర చిత్ర బృందంతోపాటు.. మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అతిరధమహారధులు అతిధులగా పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్య సినిమాకు తెలుగులో గల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. మేము' ఆడియో ఫంక్షన్‌ను

శిల్పకళా వేదికపై అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మేము' చిత్ర బృందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు' అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య'కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

More News

'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.

వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

చిరు మూవీపై వినాయ‌క్ కామెంట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా త‌మిళ చిత్రం క‌త్తి సినిమా రీమేక్ చేయ‌నున్న‌ట్టు...ఈ మూవీకి వినాయ‌క్ డైరెక్ట‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

'త్రిపుర' మూవీ రివ్యూ

కొన్ని సినిమాలకు క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చేస్తుంది. త్రిపురకు కూడా విడుదలకు ముందు మరింత క్రేజ్ వచ్చింది. త్రిపుర పాత్రలో స్వాతి నటించడం వల్ల కావచ్చు. గీతాంజలి సినిమా తీసిన దర్శకుడు తీస్తున్న మరో సినిమా అనీ కావచ్చు.

బాలీవుడ్ శ్రీమంతుడికి పోటాపోటీ

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌ మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కించారు.