అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

  • IndiaGlitz, [Thursday,August 30 2018]

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదాప‌డేలా క‌న‌ప‌డుతుంది. నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా షెడ్యూల్ వాయిదా ప‌డింద‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై యూనిట్ స్పందించింది. సాంకేతిక కార‌ణాల‌తో సినిమా ఆల‌స్య‌మైంద‌ని చెప్పిన యూనిట్ డైరెక్ట‌ర్ అనారోగ్యం గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీపావ‌ళికి వ‌స్తాడ‌నుకున్న సూర్య అభిమాన‌ల‌కు ఇది నిరాశ‌ను క‌లిగించే విష‌య‌మే.

More News

ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను , టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటు.

అభిమానుల‌కు హ‌రికృష్ణ చివ‌రి లేఖ‌...

సెప్టెంబ‌ర్ 2న హ‌రికృష్ణ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా.. త‌న‌కు అభిమానులు, స్నేహితులు ఎవ‌రైనా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేయ‌వద్ద‌ని.

హ‌రికృష్ణ చివ‌రి మాట‌లు...

ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హ‌రికృష్ణ తమ్ముడూ! అని ఆప్యాయంగా పిలుచుకునే వ్య‌క్తి నాగార్జున అక్కినేని. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ క‌లిసి మెలిసి ఉండే అనుబంధంతో పిల్ల‌ల మ‌ధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది.

ఒకే ర‌హ‌దారి.. నంద‌మూరి హ‌రికృష్ణ‌ ఫ్యామిలీ

కొన్ని ఘ‌ట‌న‌లు యాదృచ్చికంగా జ‌రిగినా.. అనుకోని లింక్ ఏదో క‌న‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యం కాకున్నా..