'ఆకాశం నీ హద్దురా'... రిలీజ్‌ను వాయిదా వేసిన సూర్య

  • IndiaGlitz, [Friday,October 23 2020]

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి. ఆయ‌న లేటెస్ట్ మూవీ ‘శూరరైపోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సూర్య సినిమాలు ఎన్‌జీకే, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌య‌వంతం కాలేపోయాయి. అయితే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాలనుకున్న సూర్య స్పీడుకు కరోనా వైరస్ బ్రేకేసింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. అస‌లు థియేట‌ర్స్ విషయంలో క్లారిటీ లేక‌పోయిన క్ర‌మంలో హీరో సూర్య‌.. ఆకాశం నీ హ‌ద్దురా చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న అమెజాన్‌లో విడుదల చేయడం లేదని సూర్య అధికారికంగా ప్రకటించారు. అయితే తదుపరి సినమా విడుదల ఎప్పుడనేది కూడా సూర్య అనౌన్స్‌ చేయలేదు. మరిప్పుడు థియేటర్స్‌ ఓపెన్‌ కావడంతో సూర్య తన నిర్ణయాన్నిఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించారు.

More News

ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు..

ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అయితే ఇది గతంలో ఉన్నదే అయినా దీనికి టైమ్ పిరియడ్ ఉండేది కానీ ఇప్పుడు టైమ్ పిరియడ్‌తో

మరో పది రోజుల్లో శశికళ విడుదల..

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు.

దీక్షిత్ కేసు: ఏడాదిగా డింగ్ టాక్ యాప్ వాడుతున్న నిందితుడు

దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.

వావ్ అనిపించిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'.