close
Choose your channels

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

Saturday, June 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ మరణించి 13 రోజులైన సందర్భంగా ‘గుడ్‌బై సుశాంత్’ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో సుశాంత్‌తో తమకున్న అనుబంధంతో పాటు సుశాంత్ ఆసక్తులు అన్నీ వెల్లడించారు. సుశాంత్‌కి ఒక టెలిస్కోప్ ఉందని.. అదంటే తనకు చాలా ఇష్టమని దాని ద్వారా నక్షత్రాలను ఆసక్తిగా వీక్షించేవాడని తెలిపింది. అలాగే తాము సుశాంత్‌ను ముద్దుగా గుల్షన్ అని పిలుచుకునే వారమని ఆయన కుటుంబం వెల్లడించింది. సుశాంత్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని.. అతని మరణం తమ కుటుంబంలో శూన్యాన్ని నింపిందని తెలిపారు. ఈ సందర్భంగా తాము తీసుకున్న కీలక నిర్ణయాన్ని సుశాంత్ కుటుంబం వెల్లడించింది.

సుశాంత్ ఙ్ఞాపకాలు, వారసత్వం ఎప్పటికీ కొనసాగాలని భావిస్తున్నామని.. అందుకే తన పేరిట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన కుటుంబం తెలిపింది. ఈ ఫౌండేషన్ ద్వారా సినిమా, సైన్స్, క్రీడల్లో టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహిస్తామని వెల్లడించింది. పాట్నాలోని రాజీవ్ నగర్‌లో సుశాంత్ పెరిగిన ఇంటిని మెమోరియల్‌గా మార్చాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఆ ఇంట్లో సుశాంత్‌కు సంబంధించిన పుస్తకాలు, టెలిస్కోప్‌తో పాటు ఇతర వస్తువులను ఉంచనున్నట్టు పేర్కొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.