‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

టాలీవుడ్‌ హీరోలు ఓ వైపు సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు.. లేదా అటు సినిమాలు ఇటు బిజినెస్.. లేదా కమర్షియల్‌ వైపు ఎక్కువగా అడుగులేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు మల్టీఫ్లెక్స్, బట్టల బిజినెస్‌లోకి దిగాడు. అంతేకాదు పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేశాడు. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా శీతలపానీయంకు సంబంధించిన యాడ్స్ చేశాడు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా మహేశ్, ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యాడు. ఇటీవలే ‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మంచి ఊపు మీదున్న సుశాంత్‌ను ఓ ప్రముఖ కంపెనీ బంపరాఫర్ ఇచ్చింది.

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సుశాంత్ ఉండాలని కోరగా.. అందుకే సుశాంత్ ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ‘స్ప్రైట్’‌కు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ఓప్రకటన విడుదల చేసింది. అంటే.. సుశాంత్ కూడా వాణిజ్య ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడన్న మాట. ఈ బ్రాండ్‌కు సుశాంత్ చేసిన మొదటి కమర్షియల్ ప్రకటన అన్న మాట. కాగా.. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండగా.. తెలుగులో సుశాంత్ అన్న మాట. సుశాంత్ యాక్ట్ చేసిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను నెట్టింట్లో వదిలారు. అయితే యాడ్‌ను పెద్దగా ప్రమోట్ చేయలేదేమో కానీ.. జనాలు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.

More News

ప్రమాదంపై క‌మ‌ల్ హాస‌న్‌కు లైకా లేఖ‌

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్‌లో క్రేన్ యాక్సిడెంట్ జ‌రిగింది.

'రాహు' మెమరీస్ వెంటాడతాయి - హీరోయిన్ కృతి గార్గ్

విడుదలకు ముందే ఇండస్ట్రీ లో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమా ‘రాహు’.  

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ కథ ఇదేనా!?

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో

మార్చి 2 నుండి కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం

త‌న‌దైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో న‌టించి మెప్పించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా త‌న రెండ‌వ చిత్రం ఎలైట్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో

2024 కల్లా పవన్ టార్గెట్ రూ. 500 కోట్లు..!

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.