Rajasingh:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత.. ఎమ్మెల్యేగా పోటీ..?

  • IndiaGlitz, [Sunday,October 22 2023]

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం శుభవార్త అందించింది. ఏడాదిన్నరగా ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 23, 2022న‌ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ విధించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ గతంలో రాజాసింగ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందిన అధిష్టానం తాజాగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

55 మందితో తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్..

మరోవైపు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈసారి బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చామని తొలి జాబితాలో 20కు పైగా సీట్లు కేటాయించినట్లు వెల్లడిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు రాజాసింగ్ ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా అధిష్టానం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్ టికెట్ రాజాసింగ్‌కే కేటాయించినట్లు తెలుస్తోంది.

2018లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే..

కాగా టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన రాజాసింగ్.. 2014లో బీజేపీలో చేరారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ హిందువుల ఓట్లు ఎక్కువగా ఉండటం.. ఆయన కూడా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తాన పక్కా హిందూత్వవాదిగా ముద్రపడ్డారు. దీంతో రాజాసింగ్‌కు గోషామహల్ నుంచి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.

More News

Bigg Boss 7 Telugu : ఆ బూతులేంటీ .. భోలే షావళిపై నాగ్ ఆగ్రహం, శివాజీని పాముగా తేల్చేసిన ఇంటి సభ్యులు

బిగ్‌బాస్ 7 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ 50 రోజులు పూర్తి చేసుుకంది. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని శనివారం హౌస్‌లో అనౌన్స్ చేశారు.

Mangalavaram:‘మంగళవారం’ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరు.. కలెక్షన్స్‌తో దుమ్మురేపుతున్న బాలయ్య

RX100, మహాసముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తు్న్న మంగళవారం చిత్రం ట్రైలర్ విడుదలైంది.

Pawan:చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. అధికార ప్రతినిధులకు పవన్ సూచన

రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Gaddar Daughter: ఎన్నికల్లో పోటీకి గద్దర్ కూతురు సిద్ధం.. కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం

ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన చేస్తుంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్...

Motkupalli: చంద్రబాబును చంపాలని చూస్తున్నారు.. మోత్కుపలి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి స్పందిస్తూ ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.