ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం

  • IndiaGlitz, [Monday,October 19 2020]

తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. నేడు తిరుమల వేంకన్న దర్శనానికి శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి హెలికాఫ్టర్‌లో కోయంబత్తూరు నుంచి బయలుదేరారు. హెలికాఫ్టర్ కుప్పం సమీపంలోని తిరుపత్తూరు వద్దకు చేరగానే అక్కడంతా పొగమంచు కమ్మేసి ఉంది.

వాతావరణం పూర్తి ప్రతికూలంగా మారడంతో హెలికాఫ్టర్ ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో అక్కడే కాసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం అత్యవసరంగా తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలికాఫ్టర్ క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాఫ్టర్‌లో ఇద్దరు పైలెట్లు సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు.

సమాచారం అందుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే హెలికాఫ్టర్ అక్కడి నుంచి తిరుపతికి బయలు దేరింది. కాగా పొలాల్లో హెలికాఫ్టర్ దిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

More News

నారప్ప కూడా షురూ చేయ‌బోతున్నాడు...!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగు రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నిహారిక డెస్టినేష‌న్ పెళ్లి...!

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జ‌ర‌నుందనే వార్త‌లు ఆమె ఎంగేజ్‌మెంట్ స‌మ‌యంలో వినిపించాయి.

ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుట పడింది: నమ్రతా శిరోద్కర్

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.

లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ 'తిమ్మరుసు'

'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి  విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'

మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచార కేసు నమోదైంది.