close
Choose your channels

చంద్రబాబును ఓడించాలని స్వామిజీ షాకింగ్ నిర్ణయం!

Thursday, February 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధాలు, జోస్యాలు, శాపనార్థాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకూ నేతలు-నేతలకు మధ్యే వివాదం అనుకుంటే తటస్థులు సైతం వీరి మధ్య దూరి హడావుడి చేస్తున్నారు. అయితే ఎవరేం చేసినా మళ్లీ తానే సీఎం సీటుపై కూర్చుంటానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన్ను అధికారంలోకి రానివ్వకుండా ఉండాలని వైసీపీ అధినేత జగన్, జనసేన అధినే పవన్ కల్యాణ్ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబును టార్గెట్ చేసి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరుకుందన్నారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజ్యశ్యామల యాగం చేయబోతున్నట్టు ఆయన షాకింగ్ ప్రకటన చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో పాలన గాడి తప్పిందని స్వరూపానందేంద్ర ఆరోపించారు. ఆలయ భూములు అన్యాక్రాంతమైనా పాలకులు పట్టించుకోవడం లేదని.. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గరున్నాయని.. వాటన్నింటినీ త్వరలో బయటపెడతానన్నారు.

కాగా.. టీటీడీ అధికారులతో పాటు చంద్రబాబుపై కేసు పెడతానని.. దీనిపై కోర్టులోనూ కేసు వేస్తానని స్వామీజీ స్పష్టం చేశారు. ఇటీవల పలు వివాదాలతో ఈయన వార్తల్లో నిలిచారు. ఒకానొక సందర్భంలో స్వామీజీ వర్సెస్ టీడీపీ మహిళ నేత యామినేని సాధినేని పెద్ద వివాదమే ఏర్పడింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు సైతం చేసుకున్న సందర్భాలవీ. పలు ఇంటర్వ్యూల్లో ఆయన జగన్‌ను సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబు సర్కార్‌‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కాగా ఇప్పటి వరకే కేసీఆర్‌ కోసం యాగం చేసిన స్వరూపానందేంద్ర.. తాజాగా టీడీపీ ఓటమి కోసం యాగం చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతుంది..? అసలు ఇలాంటి యాగాల వల్ల సీఎం కావాలనుకున్న ఆ చంద్రబాబుకు ప్లస్ అవుతుందా..? లేకుంటే వైసీపీకి ప్లస్ అుతుందా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.