close
Choose your channels

పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న హీరోయిన్‌

Tuesday, December 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న హీరోయిన్‌

తెలుగు, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో నటించడమే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్‌. గత ఏడాది ఈమె ఫిలిమ్‌ మేకర్‌ రోహిత్‌ మిత్తల్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ అటు మార్వాడి, ఇటు బెంగాళీ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది సమయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడానికి నిర్ణయించుకుని విడిపోయారు. ఈ విషయాన్ని శ్వేతా బసు ప్రసాద్‌ తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా ఫాలోవర్స్‌కు తెలియజేసింది.

“నేను, రోహిత్‌ విడిపోతున్నాం. కొన్ని నెలలు పాటు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవలేం. అంటే.. అది చెడు పుస్తకమని కాదు అలాగని చదవలేమని కాదు. కొన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో వదిలేయడమే ఉత్తమం. నాలో మధురమైన అనుభూతులను మిగిల్చి స్ఫూర్తి నింపినందుకు రోహిత్‌కు ధన్యవాదాలు. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బాలనటిగా కెరీర్‌నుస్టార్ట్‌ చేసిన శ్వేతా బసు ప్రసాద్‌ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారింది. సినిమా నటిగానే కాదు సీరియల్స్‌లోనూ ఆమె నటించింది. తెలుగులో కొత్త బంగారులోకం, రైడ్‌, కాస్కో, కళావర్‌ కింగ్‌ సినిమాల్లో నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.