ఫలిస్తున్న జగన్ ప్రయత్నాలు.. కడపకు భారీ ప్రాజెక్ట్!

ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు గత ప్రభుత్వం దెబ్బిపొడుస్తుంటే.. మరోవైపు కష్టాల్లో రాష్ట్రం ఉండటంతో గట్టెక్కాలంటే పెట్టుబడులు ఆహ్వానించి.. భారీగానే ఏపీకి రప్పించాలని సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జగన్ చేస్తున్న చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే అని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఏపీలో భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. జగన్ ఇలాఖా, కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ స్థాపించేందుకు ఓ స్విస్ కంపెనీ ముందుకు రావడమే ఇందుకు చక్కటి ఉదాహరణ.

భారీ ప్రాజెక్ట్!

వైయస్సార్‌ జిల్లాలో ఇప్పటికే బ్రాహ్మణి స్టీల్ ఫ్లాంట్‌కు జగన్ ఇదివరకే భూమి పూజ చేసిన విషయం విదితమే. అయితే.. ఇదే జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు జగన్‌ ఎదుట వైయస్సార్‌ జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు.

అన్ని విధాలా సేఫ్!

వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

More News

30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలంటే.. : తమ్మారెడ్డి ట్రిక్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నయ్యకు సుజిత్.. తమ్ముడికి కిషోర్!

మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ

'కాలేజ్ కుమార్' ను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది - రాహుల్ విజయ్

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణ లో ఎల్ పద్మనాభనిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో

'పలాస 1978' అందరూ మాట్లాడుకునే చిత్రం అవుతుంది - తమ్మారెడ్డి, వరప్రసాద్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో

‘మధ‌’ మోషన్ పోస్టర్ విడుదల

రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మిస్తోన్న చిత్రం ‘మ‌ధ‌’.