శ‌ర‌వేగంగా సైరా

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మ‌క చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి 30 శాతంకి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. హైద‌రాబాద్‌లోని కోకాపేట్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల భారీ షెడ్యూల్ ఇప్పుడు జ‌రుగుతోంది. స్పెయిన్‌కు చెందిన‌ హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ల ఆధ్వ‌ర్యంలో క‌థ‌కు కీల‌క‌మైన‌ పోరాట ఘ‌ట్టాలను తెర‌కెక్కిస్తున్నారు. దీని కోసం రాత్రి, ప‌గలు తేడా లేకుండా చిరుతో స‌హా ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం ఈ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. డిసెంబ‌ర్ నాటికి టాకీ పార్ట్ పూర్తిచేసి.. ఆ త‌రువాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్ట‌నుంది చిత్ర బృందం. వ‌చ్చే వేస‌విలో ఈ సినిమా విడుద‌ల అవుతుంది.

More News

ప‌తాక సన్నివేశాల్లో రామ్ చిత్రం

రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదే పేరుతో మ‌రోసారి మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్థాయిని అమాంతంగా పెంచేసిన చిత్రం 'పోకిరి'. 2006లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం 'టిక్ టిక్ టిక్'

"టిక్ టిక్ టిక్ " విడుదలకు ముందు వరకు అంతరిక్షం నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ గా అందరీ దృష్టిని ఆకర్షించింది.ట్రైలర్ చూడగానే గ్రావిటీ ,ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాల

హీరో శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

"రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్",  "కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్" బ్యానర్సపై "శ్రీ ఓం సినిమా" సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో

తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ 'పంతం' పెద్ద హిట్ కావాలి - దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో