సైరా షూటింగ్ పూర్తి
- IndiaGlitz, [Monday,June 24 2019]
తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న హిస్టారికల్ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. రామ్చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. చాలా రోజులుగా రీ షూటింగ్స్ తదితర కార్యక్రమాలతో సినిమా షూటింగ్ కొనసాగుతూ వచ్చింది. మొత్తానికి షూటింగ్ పూర్తయ్యింది.
ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 'సైరా షూటింగ్ పూర్తి. మరచిపోలేని ప్రయాణం టీం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. సహకారం అందించారు. అందరికీ థాంక్స్. డిఐ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది' అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు రత్నవేలు.
చిరంజీవి టైటిల్ పాత్రలో పోషిస్తుండగా అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, కిచ్చాసుదీప్, జగపతిబాబు, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న సినిమా టీజర్ విడుదలవుతుందని టాక్.