మంత్రిపై తాప్సీ ఘాటు వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

కేంద్ ప్ర‌భుత్వం కొత్త తీసుకు రావాల‌నుకుంటున్న రైతు చ‌ట్టాల‌పై పోరాటం చేస్తున్న రైతుల్లో కొంద‌రు క‌న్నుమూశారు. ఈ వ్య‌వ‌హారంపై హ‌ర్యానా వ్య‌వ‌సాయ శాఖా మంత్రి జేపీ ద‌లాల్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ తాప్సీ ట్వ‌ట్ట‌ర్ వేదిక‌గా మంత్రిని ఏకేసింది. ఇంత‌కీ జేపీ ద‌లాల్ రైతుల‌ను ఏమ‌న్నాడో తెలుసా? ‘‘కొన్ని లక్షల మందిలో రెండు వందల మంది చనిపోరా.. ఇంట్లో ఉండి ఉంటే వాళ్లు చనిపోకుండా ఉంటారా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే చనిపోయారు అంటూ దలాల్‌ అన్నాడు. దీనిపై తాప్సీ ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా స్పందించింది. మనిషి జీవితానికి విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువ లేదు. అన్నదాల మరణాలను అపహాస్యం చేస్తున్నారు అని కౌంట‌ర్‌గా స‌మాధానం చెప్పింది తాప్సీ.

త‌ర్వాత తాను మాట్లాడిన తీరుపై అంద‌రూ కోపంగా ఉన్నార‌ని గ్ర‌హించిన జేపీ ద‌లాల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పుకున్నాడు. ఎంత క్ష‌మాప‌ణ‌లు చెప్పినా ఓ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి అలా ఎలా మాట్లాడుతాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు మ‌రి.

More News

ఎగ్జ‌యిట్ అవుతున్న కీర్తిసురేష్‌..!

మ‌హాన‌టితో జాతీయ అవార్డును ద‌క్కించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్.. చాలా ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పింది.

గ‌ట్టి పోటీ మ‌ధ్య వ‌స్తున్న నాగ్‌...!

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లోన‌టిస్తోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. సాల్మ‌న్ అహిషోర్ డైరెక్ట‌ర్‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాదిలోనే విడుదల కావాల్సింది.

'మ‌యూరాక్షి' ఆడియో లాంచ్‌

`భాగ‌మ‌తి` ఫేం  ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా మ‌ల‌యాళంలో రూపొందిన `ఐరా` అనే సూప‌ర్ హిట్ చిత్రాన్ని `మ‌యూరాక్షి`

నిధి అగ‌ర్వాల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అభిమానులు

అభిమానం విప‌రీతానికి చేరుకుంటే ఏమంటారు?.. పిచ్చి అనే అంటారు. కానీ ఇత‌రుల‌కు న‌ష్టం క‌లిగించనంత వ‌ర‌కు ఎవ‌రి పిచ్చి వారికి ఆనందాన్ని ఇస్తుంది.

మెగాస్టార్‌తో పాటు మహేష్, ఎన్టీఆర్‌లను బీట్ చేసిన వైష్ణవ్?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే అదరగొడుతున్నాడు. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే వసూళ్ల ‘ఉప్పెన’ సాగిస్తోంది.