ఫొటోలు తీశాడని యువకుడ్ని తాప్సీ ఏమందో చూడండి!

  • IndiaGlitz, [Monday,June 24 2019]

హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏదైనా సరే మొహమాటం లేకుండా ముఖాన్నే అడిగిపారేస్తుంటారు. అంతేకాదు తనకు నచ్చకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్ధాక్షిణంగా తప్పుకుంటారు. అయితే సినిమా షూటింగ్ అనంతరం జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగమ్ము. షూటింగ్ పూర్తయిన తర్వాత తాప్సీ.. సోదరితో కలిసి సరదాగా బయటికెళ్లిందట. అయితే ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ వ్యక్తి దొంగ చాటుగా ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఈ విషయం గమనించిన ‘ఫోన్‌ లోపల పెడతావా? లేక పగలగొట్టనా?.. ముందు నువ్ తీసిన ఫొటోలు డెలీట్ చెయ్’ అని బెదిరించింది. అయితే ఆమె పక్కనే సోదరి మాత్రం భయపడి తానేమీ ఎరుగనట్లుగా ఉండిపోయిందట. తాప్సీ బెదిరింపులకు ఆ వ్యక్తి అక్కడ్నుంచి పారిపోయాడంట.

కాగా.. ‘బద్లా’ సినిమాలో నటిస్తున్న సమయంలో తాప్సిని చూసి సోదరి చాలా భయపడేదట. ఎందుకంటే ఆ సినిమాలో ఆ పాత్ర భయంకరమైనది గనుక. ఈ సినిమాలో తాప్సి ఓ వ్యక్తిని తనకు తెలీకుండానే చంపేస్తుంది. అలా నిజ జీవితంలో ఆ ఫొటోలు తీసిన వ్యక్తిని ఏం చేస్తుందో ఏమో అని తాప్సీ సోదరి పక్కనే నిల్చుని భయపడిందట.

సో.. ప్రైవేట్‌గా ప్రాంతాల్లో నటీనటులను కాస్త ఫ్రీగా ఉండనివ్వండి.. ఎంతసేపు సినిమాలు ఇవేనా వాళ్లు రిలీఫ్ కోసం తిరుగుతుంటారు.. ఇలాంటి సమయాల్లో ఇబ్బంది పెట్టడం తప్పు కదా. మరీ ముఖ్యంగా అనుమతి లేకుండా ఫోటోలు తీయడం అంటే పెద్ద తప్పే.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

హీరో రామ్‌కు జరిమానా నిజమేనా!?

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’.

మహాలక్ష్మి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.2 సినిమా ప్రారంభం

రంజీత్, సౌమ్య మీనన్ లకు హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పత్తికొండ కుమారస్వామి నిర్మాణ సారధ్యంలో యం. రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం

వంగవీటి రాధా కీలక నిర్ణయం.. ఈసారి జనసేనలోకి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

'బుర్రకథ' ట్రైలర్‌ను ఆవిష్క‌రించిన విక్ట‌రీ వెంక‌టేశ్‌

దీపాల ఆర్ట్స్ టప్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బుర్రకథ'.

దొరసాని ‘కళ్లల్లో కలవరమై’ సాంగ్ లాంచ్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’..