బాలయ్య ఎందుకలా అన్నారో కనుక్కుంటా.. సీఎంకు వివరిస్తా!

  • IndiaGlitz, [Thursday,May 28 2020]

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు.

‘అసలు బాలకృష్ణ అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. ఆయన ఏమన్నారో చూసిన తర్వాతే నేను స్పందిస్తాను. ఆ విజువల్స్ అన్నీ పాతవి ఇప్పటివి కాదని కొందరు అంటున్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. చర్చలకు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులు వచ్చారు. సినిమా, టీవీ షూటింగులకు సంబంధించే ఆ సమావేశంలో చర్చించాం తప్ప మిగతా విషయాలేమీ మాట్లాడలేదు. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న వారిని సమావేశానికి పిలిచామని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి సమావేశం పెట్టమన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అసలు విషయాలన్నీ చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని విషయాలను వివరిస్తాను’ అని మంత్రి తలసాని చెప్పుకొచ్చారు.

More News

టాలీవుడ్‌లో నివురు గప్పిన విబేధాలు.. అసలెందుకిలా..!?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయా..? నిన్న మొన్నటి వరకూ ఇండస్ట్రీ మొత్తం ఏకథాటిపైనే ఉందనుకున్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయా..?

బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

టాలీవుడ్ సినిమా షూటింగులు పున: ప్రారంభించడంపై నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి 2020 బాగా క‌లిసొచ్చింది. ఈయ‌న హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’.

రీమేక్‌లో సూర్య‌, కార్తి

కొత్త కాన్సెప్ట్‌ల‌ను భాషా బేదం లేకుండాసినీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటార‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓటీటీ మాధ్య‌మాలు ఎక్కువైన నేటి రోజుల్లో సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాయి.

సమంతపై అభ్యంతరకర పోస్ట్.. పూజా హెగ్దే అకౌంట్ హ్యాక్!

ఇదేంటి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ పూజా హెగ్దే.. సమంతపై అభ్యంతర పోస్ట్ చేసిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పోస్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ చేసింది మాత్రం పూజా హెగ్దే కాదట.