అనుష్క తరువాత తమన్నానే..

  • IndiaGlitz, [Thursday,August 31 2017]

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌న్నెండేళ్లు అవుతున్నా.. టాప్ లీగ్‌లోనే కొన‌సాగుతోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర తార‌గా పేరు తెచ్చుకున్న త‌మ‌న్నా.. ఈ రెండు భాషల్లోనూ ఇప్ప‌టికీ బిజీగానే ఉంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నా త‌మిళంలో 'స్కెచ్' అనే సినిమా చేస్తోంది. చియాన్ విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హోమ్లీ లుక్స్‌తో సంద‌డి చేయనుంది. విక్ర‌మ్‌తో ఈ మిల్కీ బ్యూటీ క‌లిసి న‌టిస్తున్న తొలి చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 'స్కెచ్‌'తో త‌మిళంలో ఈ జ‌న‌రేష‌న్ టాప్ హీరోలంద‌రితోనూ క‌లిసి న‌టించిన రెండో హీరోయిన్‌గా త‌మ‌న్నా గుర్తింపు తెచ్చుకుంటోంది. సూర్య‌తో అయ‌న్ (వీడొక్క‌డే), విజ‌య్‌తో (సురా), అజిత్ తో వీర‌మ్ (వీరుడొక్క‌డే) చిత్రాలు చేసిన త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం విక్ర‌మ్‌తో 'స్కెచ్' చేస్తోంది. ఇదివ‌ర‌కు ఈ న‌లుగురు హీరోల‌తోనూ అనుష్క క‌లిసి న‌టించింది. ఇక త‌మ‌న్నా తోటి హీరోయిన్లు అయిన‌ కాజ‌ల్‌, శ్రుతి హాస‌న్‌, స‌మంత త‌దిత‌రుల‌కు ఇంకా ఒక్కో హీరో బాకీ ప‌డే ఉన్నారు.

More News

మరో బయోపిక్ లో విద్యాబాలన్....

డర్టీపిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్

రేపటి నుంచి యు.ఎస్. లో నితిన్ చిత్రం షూటింగ్

యూత్ స్టార్ నితిన్,మేఘా ఆకాష్ జంటగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్,శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా

సేమ్ టు సేమ్ అంటున్న అనుపమ

అనుపమ పరమేశ్వరన్..తెలుగులో ఇప్పటివరకు ఈ కేరళ కుట్టి నటించిన సినిమాల సంఖ్య ముచ్చటగా మూడే.

సురేష్ బాబు విడుదల చేసిన 'మెంటల్ మదిలో' ట్రైలర్

'పెళ్ళిచూపులు'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం'మెంటల్ మదిలో'.

'మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ ' టైటిల్ నెగ్గిన హైదరాబాదీ మానసా జొన్నలగడ్డ

మానసా జొన్నలగడ్డ...ఇప్పుడీ పేరు అందాల ప్రపంచంలో ఓ సంచలనం.ఎవరీ అమ్మాయి?