ఇంటికి చేరుకున్న తమన్నా...

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

తమన్నా ఇంటికి చేరుకోవడమేంటి? అనే సందేహం కలుగక మానదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేస్తూ 'హోం కమింగ్‌' అంటూ మెసేజ్‌ను కూడా షేర్‌ చేశారు. ఇంతకూ తమన్నా ఆ వీడియోను షేర్‌ చేయడం వెనుక కారణం.. ఆమెకు కోవిడ్‌ సోకడమే. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు, ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన తర్వాత ఓ డిజిటల్‌ మాధ్యమంలో ఓ కార్యక్రమంలో నటించడానికి అంగీకరించింది. అందుకోసం ఇటీవల కాలంలో హైదరాబాద్‌ వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కరోనా వైరస్‌ సోకింది. ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉన్నప్పటికీ తనకు కరోనా సోకిందని, ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని కూడా తమన్నా చెప్పింది.

అది వరకే ఆమె తల్లిదండ్రులకు కరోనా వచ్చింది. దీంతో వెంటనే తమన్నా ఇంటికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే కరోనా పూర్తిస్థాయిలో తగ్గేవరకు రెస్ట్‌ తీసుకుని షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసేసి ముంబై చేరుకుంది. ''నేను ఇంత త్వరగా రికవర్‌ అయ్యి ఇల్లు చేరుతానని అనుకోలేదు. అభిమానులు, శ్రేయోభిలాషుల వల్లనే ఇది సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతానికి బలాన్ని సంపాదించుకోవాలి'' అంటూ వీడియో ద్వారా తమన్నా తను ఇల్లు చేరుకున్న విషయాన్ని తెలియజేసింది. సినిమాల విషయానికి వస్తే సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో పాటు నితిన్‌ చేస్తున్న బాలీవుడ్‌ రీమేక్‌ 'అంధాదున్‌' చిత్రంలోనూ తమన్నా నటిస్తున్నారు.