తమన్నా ‘లెవెన్త్ అవర్’ ట్రైలర్ అదిరిపోయింది..

  • IndiaGlitz, [Wednesday,April 07 2021]

కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఓటీటీల హవా బీభత్సంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్‌, ఆహా అందుబాటులో ఉన్నాయి. మహమ్మారి సెకండ్ వేవ్ కలవరపెడుతున్న సమయంలో మరోమారు ఓటీటీ కంటెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు కొత్త కాన్సెప్ట్స్‌తో బడా బడా నిర్మాతలు సైతం ఓటీటీ కంటెంట్ నిర్మించే పనిలో ఉన్నారు. తమ సిరీస్‌లో నటించేందుకు ఏకంగా స్టార్ హీరోయిన్స్‌నే ఎంచుకుంటున్నారు.

మంచి రెమ్యూనరేషన్ , తక్కువ కాల్ షీట్లు , అద్భుతమైన ఫేమ్ వస్తుండటం తో బడా హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే సమంత – ఫ్యామిలీ మ్యాన్ 2 ( అమెజాన్ ప్రైమ్ ), కాజల్ – లైవ్ టెలికాస్ట్ ( హాట్ స్టార్ ), శృతి – పిట్టకథలు ( నెట్ ఫ్లిక్స్ ), రాశి ఖన్నా – సన్నీ వంటి సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా లెవెన్త్ అవర్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆహా వేదికగా ఈ లెవెన్త్ అవర్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా లెవెన్త్ అవర్‌కు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ను ప్రవీణ్ యూ... నిర్మించారు.

‘‘అనగనగా ఒకరోజు.. రెడ్ రైడింగ్ హుడ్ తన అమ్మమ్మను చూడటానికి బయల్దేరింది.. వెళ్లే దారిలో పెద్ద అడవి.. కొంచెందూరం వెళ్లే సరికి చీకటి పడింది. చీకట్లో పాపం తను దారి తప్పిపోయింది. చీకటి పడగానే ఆకలితో ఉన్న నక్కలు అరవడం మొదలుపెట్టాయి. రెడ్ రైడింగ్ హుడ్‌కి భయం వేసింది’’ అంటూ తమన్నా తన కథను తన కూతురికి చెబుతుండగా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. తన చుట్టూ ఉన్న రాబందుల్లాంటి మనుషుల నుంచి తమన్నా తనను తాను ఎలా రక్షించుకుంటుందనే కథాంశంతో రూపొందింది. ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో ఈ సిరీస్ రూపొందినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. కథ మొత్తం తమన్నా చుట్టూ తిరిగేలా రూపొందించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇక సిరీస్ ఇంతకు మించి ఉంటుందని అంచనా.

More News

సినీ థియేటర్లకు జగన్ సహకారం.. ధన్యవాదాలు చెప్పిన చిరు

కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న దీనికి తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం తన సహకారాన్ని అందించి

వరుణ్‌కి సాయిపల్లవితో పెళ్లి.. నాగబాబు ఫన్నీ రిప్లై

ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానులతో తరచూ టచ్‌లో ఉంటూ వారు అడిగే సిల్లీ క్వశ్చన్స్‌కి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అంతకు మించి

అభిమానుల అత్యుత్సాహం.. అజిత్ ఆగ్రహం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేడు జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ స్టార్ హీరోలంతా తమకు కేటాయించిన

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది.

తమిళనాడు ఎన్నికల్లో రూ.428 కోట్లు సీజ్

తమిళనాడులో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రలోభాలకు తెరదీశాయి.