ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ సినిమా!!

  • IndiaGlitz, [Friday,July 17 2020]

2014లో హిందీలో వచ్చిన ‘క్వీన్’ సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. హిందీలో ‘క్వీన్’గా నటించిన కంగనా రనౌత్ పాత్రని తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్.. క‌న్న‌డలో పారుల్ యాద‌వ్, త‌మిళంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ విషయంలో నీలకంఠ, తమన్నాల మధ్య విబేధాలు తలెత్తడంతో నీలకంఠ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆయ‌న స్థానంలో అ!, క‌ల్కి చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించారు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని...మను కుమరన్ నిర్మించారు. ఎప్పుడో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో విడుద‌ల కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వ‌స్తుంది.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌కుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని టాక్‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని అంతా ఓకే అయితే సినిమా కొన్ని రోజుల్లోనే ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే త‌మ‌న్నా, కాజ‌ల్ న‌టించి ఓటీటీలో విడుద‌ల‌య్యే సినిమా ఇదే అవుతుంది. ఇప్ప‌టికే కీర్తి సురేశ్ సినిమా పెంగ్విన్ ఓటీటీలోనే విడుద‌లైంది.

More News

ఐదేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో సందీప్‌....

ప్ర‌స్థానం సినిమాతో న‌టుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సందీప్ కిష‌న్ అటు త‌మిళం, ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు సందీప్‌.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట

ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురు..

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురైంది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.