ఫేషియల్‌కని వెళ్లిన నటిని అందవిహీనంగా మార్చేసిన డాక్టర్..

  • IndiaGlitz, [Monday,April 19 2021]

ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటీమణులైతే.. చాలా ప్రాధాన్యం ఇస్తారు. తమ అందాన్ని కాపాడుకునేందుకు వాళ్లు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. దీనికోసం తీసుకునే ఫుడ్ విషయంలోనూ జాగ్రత్త వహిస్తారు. అలాగే.. ఫేషియల్స్‌ అని, సర్జరీలతో పేరుతో తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు నిత్యం ఆరాటపడుతూనే ఉంటారు. అయితే ఈ అందాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నటికి ఊహించని కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఫేషియల్ కోసమని ఓ డాక్టర్ వద్దకు వెళితే.. ఆమె కాస్తా ముఖాన్ని అందంగా మార్చడం అటుంచి అందవిహీనంగా మార్చేసింది.

తమిళ నటి రైజా విల్‌సన్‌‌కు ఈ అనూహ్య సంఘటన ఎదురైంది. సాధారణ ఫేషియల్‌ కోసమని రైజా విల్‌సన్ ఇటీవల ఓ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడి మహిళా డాక్టర్‌ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. అది కాస్తా వికటించింది. దీంతో నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి అందం మాట అటుంచితే అందవిహీనంగా మార్చేసింది. విషయం కనుక్కుందామని వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు సరికదా.. అసలు తను ఊళ్లోనే లేనని సిబ్బందితో చెప్పిస్తోంది. దీంతో ఆ వైద్యురాలు తనకు చేసిన నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

నాకు అవసరం లేకపోయినా డాక్టర్‌ భైరవి‌ నాకేదో చేయాలని ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది. 'డా.భైరవి తన దగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది' అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లలో వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి రైజా విల్సన్ షాకైంది.

More News

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జనసేన-బీజేపీ

ఏపీలో కొనసాగుతున్న పొత్తును తెలంగాణలోనూ కొనసాగించేందుకు జనసేన-బీజేపీ సిద్ధమవుతున్నాయి.

షాకింగ్.. కళ్ల నుంచి కరోనా..!

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి ఇంతలా విస్తరించడానికి పలు కారణాలను శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ వస్తున్నారు.

నానితో సినిమా స్టార్ట్.. వెల్లడించిన హీరోయిన్ నజ్రీయా

ఇండస్ట్రీలో ఎవరైనా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తారంటే.. పక్కాగా వారిలో ముందు వరసలో నేచురల్‌ స్టార్‌ నాని పేరుంటుంది.

పూజ చేసి ఆపేసిన రవితేజ..

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఏప్రిల్ రెండవ వారం నుంచి కరోనా కేసులు దారుణంగా పెరిగిపోయాయి.

తల్లి పాత్రకు నో చెప్పిన రష్మిక..

దక్షిణాది చిత్రసీమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు.