తరుణ్ హీరోయిన్ కి తమిళ క్రేజ్...

  • IndiaGlitz, [Wednesday,July 26 2017]

హీరో త‌రుణ్ ఇట్స్ మై ల‌వ్‌స్టోరీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెల‌సిందే. ఈ చిత్రంలో ఓవియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈమె ప్ర‌స్తుతం క‌మ‌ల్ వ్యాఖ్యాత‌గా చేస్తోన్న త‌మిళ వెర్ష‌న్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్‌గా చేస్తుంది. ఈ షోలో ఓవియా ప్ర‌వ‌ర్త‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంద‌ట‌. హీరో శింబు కూడా ఓవియాకే మ‌ద్ధ‌తు తెలుపుతున్నాడంటే ఆమెకు ఎంత పేరుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ క్రేజ్‌తో ఓవియాకు త‌మిళ సినీ రంగం నుండి వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ' మెట్రో' ఫేమ్‌ శిరీష్‌ తన తాజా చిత్రంలో ఓవియకు కథానాయకి అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా యామిరుక్క భయమే చిత్ర పార్టు–2లోనూ ఓవియను ఎంపిక చేసుకున్నారు అదే విధంగా విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశాన్ని ఓవియ కొట్టేసింది. చూస్తుంటే ఓవియా షో నుంచి బయటకు రాగానే మరి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు త‌మిళ సినీ వ‌ర్గాలు.

More News

మరో చారిత్రాత్మక చిత్రంలో...

తమిళ,తెలుగు ప్రేక్షకులకు కట్టప్పగా గుర్తుండి పోయే నటుడు సత్యరాజ్.

దర్శకుడిగా అరవిందస్వామి...

దళపతి చిత్రంతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి.

సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ

సీనియర్ జర్నలిస్టు, రచయిత, కవి భగీరధను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడుగా నియమించింది. సినిమా రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న భగీరథ ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఈ నెల 28 న 'పైసా వసూల్ ' స్టంపర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్'.

బెల్లంకొండ సినిమాలో విలన్ గా...

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్