వారిని టార్గెట్ చేసుకున్న తరుణ్

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ‌ ప్రేమ కథా చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు యువ క‌థానాయ‌కుడు త‌రుణ్‌. త్వ‌ర‌లో ఇది నా లవ్ స్టోరి' అంటూ సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోషన్స్ కోసం తనే స్వయంగా రంగంలోకి దిగారు త‌రుణ్‌. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న తరుణ్..

ఇప్పుడు త‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే యూత్‌ని, కాలేజ్ అమ్మాయిల‌ని తిరిగి ఎట్రాక్ట్‌ చేయ‌డ‌మే టార్గెట్‌గా ఈ ప్ర‌మోషన్స్ చేయ‌బోతున్నారట‌. ఈ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాలని...పూర్వ వైభవం సంపాదించుకోవాలని తరుణ్ మంచి పట్టుదలతో ఉన్నారు. తరుణ్ సరసన ఓవియా క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా ద్వారా రమేష్ గోపి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

రాజశేఖర్.. మూడు కొత్త ప్రొజెక్ట్స్‌

దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత విజయాన్ని చవిచూసారు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు డా.రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'పి.ఎస్‌.వి గరుడవేగ 126.18 ఎమ్‌' చిత్రంతో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సీనియర్ హీరో.

దుబాయ్ పయనమౌతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సాహో'.

'యు-టర్న్' అతిథులెవ‌రంటే..

2016లో కన్నడంలో వచ్చిన 'యు-టర్న్' సినిమాని.. తెలుగు, తమిళ భాషల్లో అదే పేరుతో అందాల తార‌ సమంత క‌థానాయిక‌గా పునఃనిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన విలేకరి పాత్రని ఈ రెండు భాషల్లో సమంత పోషించనున్నారు.

రజనీ మాటల రచయితే కమల్ కి కూడా..

లోక నాయకుడు కమల్ హాసన్,సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన

ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న 'చల్తే చల్తే'

'పిట్టగోడ' ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్ జంటగా అమేజింగ్ ఆర్ట్స్ పతాకంపై