గజపతినగరంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు


Send us your feedback to audioarticles@vaarta.com


అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్స వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా అంగరంగ వైభవంగా జరిగాయి. పలు రకాల సేవా కార్యక్రమాలు, రక్తదానశిబిరాలు, అన్నదానాలు, పెద్ద ఎత్తున నిర్వహించారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి సెంటర్ లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వేడుకల్ని గ్రాండ్ సక్సెస్ చేశారు.
ఉత్తరాంధ్రలో మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, ఈ వేడుకలను ముందుండి నడిపించారు. గజపతినగరం పట్టణం మొత్తం పసుపు మయమైంది. పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడిన మంత్రి.. దిశా నిర్దేశం చేస్తూ, గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాల్ని ముందుండి నడిపించారు.
తాను హాజరు కాలేకపోయిన కార్యక్రమాలను నిర్వహించిన కార్యకర్తలతో, నాయకులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన మంత్రి, వాళ్లందర్నీ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉన్న నాయకులు కూడా మంత్రి పిలుపుతో ముందుకు వచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com