close
Choose your channels

బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత పలువురు టీడీపీ ముఖ్యనేతలు.. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే నేతలు సైతం ఢిల్లీ వేదికగా కాషాయం కండువాలు కప్పుకున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు టీడీపీ విలవిల్లాడుతోంది. బుధవారం నాడు గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారనే వార్త  ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనగానితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీలోనే తిష్టవేశారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని గంటల్లో కాషాయ కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది.

మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు!

కాగా.. ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీ నేతల వద్దకు దగ్గరుండి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రేపల్లె నియోజకవర్గం నుంచి సత్యప్రసాద్ వరుసగా రెండో సారి గెలుపొందారు. అంతేకాదు.. నందమూరి కుటుంబంతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలున్న నేతలు సైతం కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకే కాదు.. నందమూరి కుటుంబానికి సైతం పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

సమంత ప్రమోట్ చేసింది ఈయన్నే!

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కు మీ అమూల్యమైన ఓటేసి.. వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఆయన్ను ప్రమోట్ చేసింది. కాగా ఆయన అనుకున్నట్లుగానే టీడీపీకి గడ్డు రోజులున్నప్పటికీ అనగాని మాత్రం గట్టెక్కారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవ్వడంతో టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.