close
Choose your channels

విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం..

Friday, December 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం..

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్లు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా.. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వం దాదాపు వెసులుబాటు కల్పించిన తర్వాత ప్రజల్లో మరింత నిర్లక్ష్యం పెరిగింది. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండో సారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

బచ్చుల అర్జనుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. కాగా.. వైసీపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. కాగా.. ఆయనతో పాటు తిరిగిన నేతలు సైతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.