విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం..

  • IndiaGlitz, [Friday,December 04 2020]

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్లు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా.. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వం దాదాపు వెసులుబాటు కల్పించిన తర్వాత ప్రజల్లో మరింత నిర్లక్ష్యం పెరిగింది. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండో సారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

బచ్చుల అర్జనుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. కాగా.. వైసీపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. కాగా.. ఆయనతో పాటు తిరిగిన నేతలు సైతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

More News

పట్టు వదలని విక్రమార్కుల్లా అఖిల్, సొహైల్...

‘పట్టి పట్టి నన్నే సూస్తంటే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రేస్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్‌ మొదలైంది. అభి.. సంచాలకుడు.

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే

జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం సాయంత్రం వెల్లడించాయి. నిజానికి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల కావాల్సి ఉంది.

'జీ 5'లో డిసెంబర్ 4న 'కోమాలి' ప్రీమియర్

03  డిసెంబర్, 2020: తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'.

క్లాస్ రూమ్‌లో మైనర్ విద్యార్థుల పెళ్లి.. లైక్స్ కోసమేనట...

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల పెళ్లి కలకలం సృష్టించింది.

తలైవా ఎంట్రీ ఫిక్స్.. జనవరిలో పార్టీ లాంచ్

తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు?