close
Choose your channels

సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ప్రశంసల వర్షం.. కంగుతిన్న తమ్ముళ్లు!

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ప్రశంసల వర్షం.. కంగుతిన్న తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం నాడు వైఎస్ జగన్ తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అటు టీడీపీ.. ఇటు వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ నమస్కరించి షేక్ హ్యాండిచ్చారు. అనంతరం సుమారు గంటపాటు శాసనమండలిలోనే జగన్ కూర్చున్నారు. జగన్ మండలిలోకి ఎంటరవ్వక మునుపు ‘ప్రత్యేక హోదా’ గురించి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ సూపర్బ్!

వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొని.. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగా గళం వినిపించారు. అసలు ప్రత్యేక హోదా ప్రాధాన్యత ఏంటి..? మీరెందుకు మాట తప్పుతున్నారు..? అని కేంద్రాన్ని ఉద్దేశించి జగన్ నిశితంగా చర్చించారు. శాసన మండలి వేదికగా ఈ వ్యవహారంపై మాట్లాడిన డొక్కా.. నీతి అయోగ్‌లో జగన్ మోహన్ రెడ్డి చాలా బాగా మాట్లాడారని ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు.. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ‘ప్రత్యేక హోదా’ కోసం పోరాటాల చేశారని ప్రశంసించారు.
అంతటితో ఆగని ఆయన.. ఇప్పుడు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని జగన్‌ను కోరారు.

ఆర్టీసీని ప్రభుత్వం వీలినం చేస్తామని సర్కార్ వేసిన కమీటీ వ్యవహారం ఎంత వరకు వచ్చిందో చెప్పాలని ఈ సందర్భంగా డొక్కా మంత్రులను కోరారు.

ఈ ప్రశంసల వెనుక అర్థమిదేనా!?

వైఎస్ జగన్‌పై డొక్కా ప్రశంసల వర్షం కురిపియడంతో అటు అసెంబ్లీలో.. ఇటు శాసన మండలిలోని తెలుగు తమ్ముళ్లు ఒకింత కంగుతిన్నారు. మరోవైపు టీవీలు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా సీఎం వైఎస్ జగన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమకు టచ్‌లో ఉన్నారని డోర్లు తెరిస్తే ఎంతమంది పార్టీలో చేరతారో అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డొక్కా ఇలా వ్యవహరించడంతో తెలుగు తమ్ముళ్లకు దాదాపు సీన్ అర్థమైపోయిందని.. పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో.. డొక్కా పార్టీ మారడానికి ఫిక్స్ అయ్యారని.. అందుకే ముందుగా జగన్‌ను మండలి వేదికగా కాకా పడుతున్నారని మరోవైపు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అయితే డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేక టీడీపీలోనే ఉంటారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.