బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

గ‌తేడాది విడుద‌లైన 'నేనే రాజు నేనే మంత్రి'తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశారు సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ తేజ‌. ఆ సినిమా త‌రువాత 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌, వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ రెండు ప్రాజెక్ట్స్ నుంచి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

ఆ త‌రువాత 'నేనే రాజు నేనే'మంత్రి క‌థానాయ‌కుడు రానాతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొంద‌నున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌స్తుంది.

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ 'సాక్ష్యం' చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే నూత‌న ద‌ర్శకుడు శ్రీ‌నివాస్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు.

More News

మ‌హేశ్‌ని క‌లిసిన ముఖ్య‌మంత్రి

భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో మ‌హేశ్ అంద‌రినీ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ కోసం నిజంగానే ముఖ్య‌మంత్రి రావ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

మరో చాలెంజ్‌కి సిద్ధమంటున్న స‌మంత‌

పస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్‌ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.

సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది.

ఈ నెల 29న 'శంభో శంక‌ర‌' గ్రాండ్ రిలీజ్‌

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్.

మూడు విభిన్నమైన పాత్ర‌ల్లో..

తమిళ క‌థానాయ‌కుడు శ‌ర‌త్ కుమార్‌కు తెలుగులోనూ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.