10th Class Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. 19 కేంద్రాల్లో 9 రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్‌ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 మధ్య జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.

బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 8,883 మంది విద్యార్థులు 10కి 10 GPA సాధించడం విశేషం. ఈ ఫలితాలను bse.telangana.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. ఇక ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా. 99.05శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా 91.31 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 27వ స్థానంలో మేడ్చల్ జిల్లా.. 30వ స్థానంలో హైదరాబాద్ జిల్లా నిలవడం గమనార్హం. 3,927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 6 ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్షల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మరోవైపు పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా సూచించారు. ఉత్తీర్ణత సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అందులో బాగా రాసి పాస్ అవ్వొచ్చని తెలిపారు.

More News

Chandrababu:పెన్షనర్లపై కక్షగట్టిన చంద్రబాబు.. తగిన బుద్ధి చెబుతామంటున్న ప్రజలు..

ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలోని పెన్షనర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కక్షకట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరి పింఛన్లు అందించేవారు.

Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.

Nominations Withdraw: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కీలమైన నామినేషన్ల ప్రక్రియకు నేటితో తెరపడింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు...

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

Pensions: ఏపీలో ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల వేళ ఎట్టకేలకు పింఛన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు