తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Monday,June 29 2020]

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వివాదంలో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు ఉండటంతో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంటూ సచివాలయ కూల్చివేతపై దాఖలైన పిటిషన్లంటినీ హైకోర్టు కొట్టివేసింది.

కాగా నూతన సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్లు వేసింది. దీనిపై ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అలాగే సచివాలయ నిర్మాణమనేది విధానపరమైన నిర్ణయమని.. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు నేడు ప్రభుత్వానికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది.

More News

మరో మార్గం లేకే మీడియా ముందుకు వెళ్లా: జగన్‌కు రఘురామ లేఖ

వైసీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. పలు సందర్భాల్లో

పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన పార్టీ అధినేత, పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి టార్గెట్. జనసేనను పట్టించుకునేవారే లేరని..

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్‌కు కార‌ణం క‌రోనా.

భీమవరం టాకీస్ ద్వారా త్వరలో OTT ప్రారంభం!

మారుతున్న టెక్నాలజీ తో మనం మారుదాం, సినిమా జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త మార్గాన్ని వెలికితీశారు.

ఎస్.జానకి ఆరోగ్యంపై వదంతులు.. వివరణనిచ్చిన కుటుంబ సభ్యులు

భారతీయ ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి గురించి ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి.