తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే హోం మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజులుగా సునీత కరోనా లక్షణాలతో బాధపడుతుండగా... టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె చికిత్స నిమిత్తం యశోదాలో చేరారు.

More News

తెలంగాణలో విశ్వరూపం చూపించిన కరోనా.. నిన్న ఒక్కరోజే...

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మొన్నటి వరకూ 1200 దాటని కరోనా కేసులు నిన్న దాదాపు 1900 కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు.

ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

ఇప్పటికే ‘పలాస 1978’ చిత్రం ద్వారా ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.

పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి.

ఎన్టీఆర్‌తో ఢీ కొట్ట‌డానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెల‌లు త‌ర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.

నా మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - అల్లు అర్జున్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీస‌, 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని అంతా ప్రేమగా పిలిచే  ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే.