కోడెల ఆత్మహత్య: బాంబ్ పేల్చిన తెలంగాణ మంత్రి!
- IndiaGlitz, [Thursday,September 19 2019]
టీడీపీ కీలక నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు..? ఆత్మహత్య వెనుక ఎవరున్నారు..? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది..? ఇది కుటుంబ నేపథ్యంలో జరిగిన ఆత్మహత్యా లేకుంటే..? కక్షసాధింపు చేస్తుండటంతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకట్లేదు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు నిజానిజాలేంటో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఆధారాలేమైనా ఉన్నాయా!?
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన తలసాని.. కోడెల ఆత్మహత్యకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను చంద్రబాబు మానసికంగా హింసించారని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి..? ఈయన దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా..? అని తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తప్పు చేసి.. ఇప్పుడిలానా..!?
‘పార్టీ సమావేశాలకు కోడెలను దూరం పెట్టారు. చివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. తప్పంతా చంద్రబాబు వైపే పెట్టుకుని.. సీఎం జగన్పై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోడెల అంతిమయాత్రలో ప్రజలకు దండాలు పెడుతూ, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. కోడెలపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినా... సోదాలు, విచారణ పేరుతో హింసించలేదు’ అని ఈ సందర్భంగా మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి ఇలా ఎందుకు మాట్లాడినట్లు..? పోలీసు విచారణలో ఏమైనా నిగ్గుతేలింటే తలసాని ఇలా మాట్లాడుతున్నారా..? అసలేం జరుగుతోంది..? అనేది తెలియాల్సి ఉంది. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.