కోడెల ఆత్మహత్య: బాంబ్ పేల్చిన తెలంగాణ మంత్రి!

  • IndiaGlitz, [Thursday,September 19 2019]

టీడీపీ కీలక నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు..? ఆత్మహత్య వెనుక ఎవరున్నారు..? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది..? ఇది కుటుంబ నేపథ్యంలో జరిగిన ఆత్మహత్యా లేకుంటే..? కక్షసాధింపు చేస్తుండటంతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకట్లేదు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు నిజానిజాలేంటో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

ఆధారాలేమైనా ఉన్నాయా!?

ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన తలసాని.. కోడెల ఆత్మహత్యకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను చంద్రబాబు మానసికంగా హింసించారని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి..? ఈయన దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా..? అని తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.

తప్పు చేసి.. ఇప్పుడిలానా..!?

‘పార్టీ సమావేశాలకు కోడెలను దూరం పెట్టారు. చివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. తప్పంతా చంద్రబాబు వైపే పెట్టుకుని.. సీఎం జగన్‌పై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోడెల అంతిమయాత్రలో ప్రజలకు దండాలు పెడుతూ, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. కోడెలపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినా... సోదాలు, విచారణ పేరుతో హింసించలేదు’ అని ఈ సందర్భంగా మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి ఇలా ఎందుకు మాట్లాడినట్లు..? పోలీసు విచారణలో ఏమైనా నిగ్గుతేలింటే తలసాని ఇలా మాట్లాడుతున్నారా..? అసలేం జరుగుతోంది..? అనేది తెలియాల్సి ఉంది. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నాగశౌర్య కొత్త చిత్రం

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నుంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో

రైతు పాత్ర‌లో వినాయ‌క్‌

రెడీ.. యాక్ష‌న్‌.. క‌ట్ అంటూ స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు వి.వి.వినాయ‌క్‌. అయితే త‌ర్వ‌లోనే ఈయ‌న రెడీ..యాక్ష‌న్‌.. క‌ట్ చెప్పించుకోనున్నారు.

డేటింగ్‌లో ప‌వ‌న్ హీరో్యిన్‌

వ‌య్యారాలా జాబిల్లి ఓణీ క‌ట్టి అంటూ ప‌వ‌న్‌ను తీన్‌మార్‌లో ఆక‌ట్టుకున్న సొగ‌స‌రి కృతి క‌ర్బందా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ ప‌వ‌న్‌తో `తీన్‌మార్‌` సినిమా చేయ‌క ముందు కృతి క‌ర్బందా కొన్ని తెలుగు

మోదీతో దీదీ భేటీ.. పేరు మారుతుందా!?

భారత ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ కలిశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లిన దీదీ.. మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట...

‘సైరా’ ట్రైలర్: ‘నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్.. కెరియర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని