close
Choose your channels

తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మృతి

Sunday, October 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీరాభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఆ వీరాభిమాని ఎక్కడి వాడో కాదు.. మన తెలంగాణకు చెందినవాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన వాడు. కొన్నె‌కు చెందిన బుస్సా కృష్ణ(40) నేటి ఉదయం మృతి చెందాడు. ట్రంప్‌కు కృష్ణ వీరాభిమాని. దీంతో తన గ్రామంలోనే ట్రంప్ విగ్రహాన్ని పెట్టి కృష్ణ పూజలు నిర్వహిస్తున్నాడు.

కాగా.. కృష్ణ తనకు వీరాభిమాని అన్న విషయం తెలుసుకున్న ట్రంప్.. ఇండియాకు వచ్చినప్పుడు కృష్ణను కలుస్తానని ట్విట్టర్‌ వేదికగా గత ఏడాది వెల్లడించారు. అయితే ఆ తరువాత ఆయన ఇండియాకు వచ్చినప్పటికీ కృష్ణను కలవలేదు. కృష్ణ మాత్రం ఒక్కసారైనా తనకు ట్రంప్‌ను కలవాలని చెబుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని.. ఈ క్రమంలోనే గుండెపోటుతో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.