తెలుగు సినీ రచయితల సంఘం ఆధ్వర్యంలో వైభవంగా ఉగాదివేడుకలు

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించింది తెలుగు సినీ రచయితల సంఘం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా.యన్ గోపి పాల్గొన్నారు.పంచాంగ శ్రవణం బ్రహ్మశ్రీ అన్నపర్తి కృష్ణ శర్మ సిద్ధాంతి గారు భాస్కర పంచాంగం ఆవిష్కరించి పంచాంగాన్ని వివరించారు.అంతే కాకుండా తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డా.పరుచూరి గోపాల కృష్ణ సభాధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం లో నంది అవార్డు గ్రహీతలకు విశిష్ట పురస్కారాన్ని అందచేశారు.
పురస్కారం పొందిన వారిలో ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ,డా.ఎస్.వి సత్యనారాయణ (వైస్ ఛాన్సలర్ తెలుగు విశ్వ విద్యాలయం)గుమ్మడి గోపాల కృష్ణ (యెన్.టి.ఆర్ రంగస్థల నటులు) సిరివెన్నెల సీతారామశాస్త్రి అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి ,రాచపాళెం రఘు,పొట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పురస్కారం అందుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమానికి బలభద్ర పాత్రుని రమణి, ఉమర్జీ అనురాధ,కొడాలి వెంకటేశ్వరరావు " మా "అధ్యక్షులు శివాజీ రాజా, పాటల రచయిత భాస్కర భట్ల,కొమర వెంకటేష్,పరుచూరి వెంకటేశ్వరరావు
పాల్గొన్నారు.

More News

'నోటుకు పోటు' సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ఎస్. కె. బషీద్

ఎస్ బి కె ఫిలిం కార్పొరేషన్ లో,ఎస్.కె బషీద్ దర్శకత్వంలో,ఎస్ కె కరీమున్నీసా నిర్మించిన చిత్రం 'నోటుకు పోటు'.

సమ్మర్ స్పెషల్ గా జయ బి. 'వైశాఖం'

ఆర్.జె.సినిమాస్ బేనర్ పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'వైశాఖం'.

ముఖ్య అతిథిగా మెగాస్టార్...

తన సినిమాల సబ్జెక్ట్స్ ఎంపికలో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ తర్వలోనే తన 151వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ తో ఆది పినిశెట్టి...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

వాట్ యాన్ ఐడియా రామ్ జీ...!

జనరల్ గా సినిమా రిలీజ్ దగ్గర పడుతోందంటే ఆ విశేషాలు చెప్పడానికి హీరోలు మీడియాని కలుస్తుంటారు.