close
Choose your channels

కుమార్తె పెళ్లి సంబంధం కోసం వెళ్తూ.. అమెరికాలో తెలుగు వారి మృతి

Monday, November 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికాలో కుమార్తె వివాహ సంబంధం కోసం ఓ తెలుగు వారికి చెందిన కుటుంబం బయల్దేరింది. అంతే కొన్ని క్షణాల్లోనే కుటుంబంలోని ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు విషయంలోకి వెళితే.. నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పటేల్‌ నర్సింహారెడ్డి (57).. హైదరాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని టెక్సాస్‌లో ఉంటున్నారు.

మూడు నెలల క్రితం నర్సింహారెడ్డి ఆయన భార్య లక్ష్మి (50)తో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే నివాసముండే యువకుడితో కుమార్తె‌కు వివాహం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే అబ్బాయిని కలిసేందుకు నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు తమ కుమారుడు భరత్‌కుమార్‌ రెడ్డి (24), కుమార్తె మౌనికతో కలిసి కారులో బయల్దేరారు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం టెక్సాస్ నగరంలోనే కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నర్సింహారెడ్డి, లక్ష్మి, భరత్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మౌనికతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం పెద్ద చింతకుంట గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సొంత గ్రామానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.