తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యం -అనూప్ సింగ్ ఠాగూర్

  • IndiaGlitz, [Saturday,April 01 2017]

రోగ్‌, సింగం3,విన్నర్ సినిమాల‌తో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టుడు అనూప్ సింగ్ ఠాకూర్‌. లేటేస్ట్ గా అనూప్ న‌టించిన రోగ్ మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా అనూప్ మీడియాతో ముచ్చటించారు.
అనూప్ సింగ్ మాట్లాడుతూ - ''నేను మూడు సంవ‌త్స‌రాల క్రిత‌మే సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. నేను మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో న‌టిస్తున్న‌ప్పుడు నా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఎలాగైనా పూరిగారి సినిమాల్లో న‌టించాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో టెంప‌ర్ షూటింగ్ జ‌రుగుతుంటే నేను దూరం నుండి చూశాను. ఇప్పుడు పూరిగారి ద‌ర్శ‌క‌త్వంలో రోగ్ సినిమాతో ప‌రిచ‌యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ అవార్డ్ గెలుచుకున్న దానికంటే పూరిగారి సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఎక్కువ‌గా సంతోషించాను. పూరిగారు నన్ను చాలా కొత్త‌గా చూపించారు. ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నేను రోగ్‌తో తెలుగు, క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు సినిమాల‌కే నా ప్రాధాన్యం ఉంటుంది. ముంబైలో సెటిల్ అయినా మా పూర్వీకులకు హైద్రాబాద్ తో సంబంధం ఉంది .. తెలుగు సినిమాల్లో ఎవ‌రు క‌ష్ట‌ప‌డితే వారికే ఎక్క‌వ ప్రాధాన్య‌త ఉంటుంది. నేను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నాను. నేను మరాఠి భాషలో రెండు సినిమాలలో హీరోగా కూడా న‌టించ‌బోతున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను. అలాగే బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను'' అన్నారు.అంతేకాకుండా బుల్లితెరపై నటించిన అనుభవం వెండితెరపై ఎంతో ఉపయోగపడిందని తెలిపారు.
నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు : అనూప్ సింగం 3 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే...మిస్టర్ వర్డల్ గా పేరుతెచ్చుకున్న అనూప్ సినిమాలలో కూడా రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు..అంతేకాకుండా లేటేస్ట్ పూరీ గారి రోగ్ చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు..తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ,నటుడిగా టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు , పారిశ్రామికవేత్త అంబర్ పేట శంకర్ , ఆర్ కె.గౌడ్ పాల్గోన్నారు..

More News

బన్ని సినిమాలో యాక్షన్ కింగ్...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రైటర్ వక్కంతం వంశీ డెబ్యూ డైరెక్షన్ లో నా పేరు శివ..

మెసేజ్ ఇవ్వనున్న తాప్సీ...

అందాల నాయిక తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా మారింది.

మహేష్ టైటిల్ ఫిక్స్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా వియత్నాంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది.

లండన్ పార్లమెంట్ లో 'లోకరక్షకుడు' లోగో విడుదల

చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై చంద్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు'

ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'

పవన్,గట్టు మను,సోనియా హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'.సంతోష్ నేలంటి దర్శకత్వం వహిస్తున్నారు.