కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

  • IndiaGlitz, [Tuesday,September 15 2020]

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి వూహాన్‌లోనే పుట్టిందంటూ చైనా వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనడానికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని డాక్టర్ లీ మెగ్ యాన్ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌లో డాక్టర్ లీ.. కరోనా వైరస్‌పై గతేడాది నుంచి పరిశోధనలు చేస్తున్నారు.

కాగా.. డాక్టర్ లీ తాను గుర్తించిన విషయాలను వెల్లడించారు. న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించానని.. అది వుహాన్‌లోని ల్యాబ్‌లో తయారైనట్లు తెలిసిందన్నారు. ఆ వెంటనే తాను వైరస్‌కు సంబంధించి హెచ్చరికలు చేశానని.. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ.. చైనా అధికారులు కానీ పట్టించుకోలేదని డాక్టర్ లీ వెల్లడించారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా తన హెచ్చరికలను బేఖాతరు చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని.. వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని డాక్టర్ లీ స్పష్టం చేశారు.

వూహాన్ ల్యాబ్‌లో పుట్టిన వైరస్‌ను సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పుట్టిందని ప్రపంచాన్ని భ్రమల్లో ఉంచారని డాక్టర్ లీ తెలిపారు. వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలూ చైనా అధికారులకు తెలుసన్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్న విషయం కూడా తెలుసని అయినా బయటకు తెలియనివ్వలేదన్నారు. వైరస్ గురించి మాట్లాడినందుకు తనను బెదిరించారని.. తన గురించి దుష్ప్రచారం చేశారని.. తన పరిశోధనకు సంబంధించిన సమాచారన్నంతా ధ్వంసం చేశారని డాక్టర్ లీ తెలిపారు. ఆ సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు అమెరికాకు పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. కాగా.. లీ ఆరోపణలన్నింటినీ వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ తోసిపుచ్చగా. చైనా అధికారులెవరూ స్పందించలేదు.

More News

సీక్రెట్‌ చెప్పేసిన చిరు..!!

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన.. మెగాభిమానులను ఆతృత కలిగించిన వార్తల్లో మెగాస్టార్‌ చిరంజీవి లుక్ ఒకటి.

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని

ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ

కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది

బిగ్‌బాస్‌లో అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. ఇంట్రెస్టింగ్..

బిగ్‌బాస్‌లో ఇవాళ ప్రేక్షకులకు కావల్సినంత స్టఫ్ దొరికేసింది. ఇవాళ నర్మదా అదేనండీ.. మన మొనాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.

కరోనా రికవరీ రేటు పరంగా ఇండియా వరల్డ్ రికార్డ్..

ఇండియా కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. రికవరీ రేటు మాత్రం రికార్డ్ స్థాయిలో ఉండటం ఊరటను కలిగిస్తోంది.