close
Choose your channels

గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!

Friday, May 14, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఎంతో మంది రోగులు ఆసుపత్రిల్లో బెడ్స్‌పై బతుకుతామనే ఆశను ఊపిరిగా చేసుకుని గడుపుతున్నారు. ఇటీవల ఒక యువతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ యువతి ‘లవ్ యూ జిందగీ’ సాంగ్‌ పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. కరోనాతో బాధపడుతున్న ఆమె కండీషన్ ఆ సమయంలో ఒకింత సీరియస్‌గానే ఉంది. ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా కూర్చొని సాంగ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియోను ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ మోనిక పోస్ట్ చేశారు.

Also Read: ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

తనను ‘లవ్ యూ జిందగీ’ సాంగ్ పెట్టివ్వమని అడిగిందని.. ఈ ధైర్యమైన యువతి కోలుకోవాలని డాక్టర్ మోనిక ట్వీట్‌లో కోరారు. కొన్ని సార్లు మనం నిస్సహాయులం అవుతామని.. మన చేతుల్లో ఏమీ ఉండదని.. అంతా భగవంతుడి దయ అని మోనిక మే 8న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో సదరు యువతి ఎంజాయ్ చేస్తున్న వీడియోను సైతం షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆమె విల్ పవర్, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని పెద్ద ఎత్తున కోరుకున్నారు. కానీ ఆ యువతి నేడు మరణించింది. ఈ విషయాన్ని డాక్టర్ మోనిక ట్విటర్ ద్వారా వెల్లడించారు.

‘చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం’ అని డాక్టర్ మోనిక యువతి మరణవార్తను వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. యువతి మరణవార్తపై ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం స్పందించారు. చాలా చాలా బాధగా ఉంది. ఆమె తన కుటుంబాన్ని తిరిగి చూడలేరని నేనెప్పుడూ ఊహించలేదు. జీవితం అనేది చాలా అన్‌ఫెయిర్‌గా ఉంది. జీవించేందుకు అర్హులైన చాలా జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి’’ అంటూ ఆవేదనగా ట్వీట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.