ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుట పడింది: నమ్రతా శిరోద్కర్

  • IndiaGlitz, [Sunday,October 18 2020]

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాను ఆదర్శంగా తీసుకుని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్స్‌తో కలిసి మహేష్ ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్స్‌ చేయించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్‌ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు గుండెలు తమ కుటుంబంలో కలిశాయని నమ్రత తెలిపారు. మరో రెండు గుండెలు మా కుటుంబానికి తోడయ్యాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్‌ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు అని నమ్రత పోస్ట్ పెట్టారు.

More News

లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ 'తిమ్మరుసు'

'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి  విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'

మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచార కేసు నమోదైంది.

‘అమ్మ’ నీ పెర్ఫార్మెన్సో.. ఆస్కార్ లెవల్..

తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్న షో.. బిగ్‌బాస్. ఈ సారి షోలో పెద్దగా తెలిసిన మొహాలు లేకపోవడంతో ప్రేక్షకులు సైతం మొదట్లో ఆసక్తి కనబరచలేదు.

గ్రేటర్‌లో ‘గులాబీ’ ప్రవాహానికి ‘వరద’ గండికొట్టనుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారినప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా.. టీఆర్ఎస్‌కు సీట్ల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది.

అఫీషియల్‌.. రవితేజ 'ఖిలాడి'

మాస్‌ మహారాజా రవితేజ 67వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది.