యూపీలో టీకా తీసుకున్న మరుసటి రోజే వార్డు బాయ్ మృతి

  • IndiaGlitz, [Monday,January 18 2021]

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ తొలిరోజు టీకా తీసుకున్న వార్డు బాయ్ ఆ మరుసటి రోజే మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. టీకా తీసుకున్న అనంతరం భారత్‌లో అస్వస్థతకు గురైన కేసులను చూశాము కానీ మృతి కేసు మాత్రం ఇదే మొదటిది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ విషాదం వెలుగు చూసింది. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.

దీంతో వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ మృతి చెందాడు. ఈ ఘటనపై మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ, మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ కారణంగానే మహిపాల్ మరణించినట్టు తాను భావించడం లేదని చెప్పారు. అతని మృతికి అసలైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకూ ఇతర దేశాల్లో మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం పలువురు మరణించిన ఘటనలు నమోదయ్యాయి. ఇండియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న 22 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఐసీయూకి తరలించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎలర్జీతో రియాక్షన్ తలెత్తిందని, తలపోటు, ర్యాష్, రెస్పిరేటరీ డిస్ట్రస్‌తో బాధపడడ్డాడని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.

More News

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు...

అనేక గొప్ప సినిమాకు టాలీవుడ్‌కు అందించిన ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు.

కేసీఆర్ యాగం.. ఆ వెంటనే కేటీఆర్‌కు సీఎం యోగం..!

తెలంగాణలో కీలక మార్పు జరగనుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. గౌతమ్‌కి హిట్ దక్కేనా?

బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడు టాలీవుడ్‌కు ద‌గ్గ‌ర‌వుతుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న సినిమాల‌ను హిందీలో రీమేక్ చేయ‌డం కాదు..

ప‌ని పూర్తి చేసిన పూజా హెగ్డే

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రాధేశ్యామ్ తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ముప్పై రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

'స్టార్‌ మా' లో రాణి రుద్రమ!!

పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ పౌరుషాన్ని, వీరవిక్రమాల్ని ఓరుగల్లు కోట బురుజులపై కాకతీయ పతాకంలా ఎగరేసిన సాహస నారి, సంచలనాల విజయభేరి “రుద్రమదేవి