ప‌వ‌న్ 28లో పాట‌లు లేవా..?

  • IndiaGlitz, [Monday,February 15 2021]

ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్ 28వ చిత్రంగా అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రానా ద‌గ్గుబాటి పవన్‌కు ధీటుగా ఉండే పాత్ర‌లో న‌టిస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రైటింగ్ విభాగంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.

ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో సంద‌ర్భానుసారం వ‌చ్చే మాంటేజ్ సాంగ్స్ మిన‌హా హీరోలైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానాల‌పై ప్ర‌త్యేక గీతాలు ఉండ‌వ‌ట‌. మ‌ల‌యాళం ఫార్మేట్‌నే మేక‌ర్స్ ఫాలో అవుతూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌. ప‌వ‌న్ సినిమాలో పాట‌లు లేక‌పోవ‌డం అంటే నిజంగా సాహ‌స‌మ‌నే చెప్పాలి. మ‌రి ఇందులో నిజా నిజాలేంటి? ఒక‌వేళ పాట‌లు లేక‌పోతే ప్రేక్ష‌కులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

రామ్ నెక్ట్స్ సినిమా ఫిక్స్‌...!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ త‌న త‌దుప‌రి సినిమాకు లైన్ క్లియ‌ర్ చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఉస్తాద్ రామ్‌..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనబడుట లేదు!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. అవడానికి కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు వారికి అత్యంత దగ్గరయ్యారు.

పీరియడ్ డ్రామా స్పై థ్రిల్లర్ లో కల్యాణ్ రామ్

నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ హీరోగా గ‌త ఏడాది ఎంత మంచివాడ‌వురా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

'ఆర్ఆర్ఆర్‌' లో ఆలియా భ‌ట్ స‌ర్‌ప్రైజ్‌..!

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

డేట్ ఫిక్స్ చేసుకున్న 'రాధేశ్యామ్'

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ `రాధేశ్యామ్` విడుద‌ల‌ గురించి ఆయ‌న అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌నే సంగ‌తి అందరికీ తెలిసిందే.