నా గది గోడలనిండా పవన్ ఫోటోలుండేవి: మాధవీలత

  • IndiaGlitz, [Sunday,August 09 2020]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాధవీలత వీరాభిమాని. ఇంతటి అభిమానిగా మారడానికి గల కారణాలను, అలాగే పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది అనే విషయాలపై మాధవీలత ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కాలేజ్ డేస్ నుంచే అంటే 17 ఏళ్ల క్రితం నుంచే తాను పవన్‌కు వీరాభిమానని మాధవీలత తెలిపారు. తన గది గోడల నిండా పవన్ ఫోటోలుండేవని ఆమె వెల్లడించారు.

‘‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మా అమ్మ నా రూమ్‌కి వచ్చేది. నా రూమ్ చూసి.. ‘ఈ రూమ్‌లోకి వస్తే నువ్వొక్కదానివే ఉన్నట్టు అనిపించడం లేదు.. ఓ నలుగురున్న ఫీలింగ్ వస్తోంది’ అనేది. ఎందుకంటే నా గోడల నిండా పవన్ కల్యాణ్ ఫోస్టర్స్ ఉండేవి. నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన ఐడియాలజీని గౌరవిస్తాను. ఫ్యూచర్‌లో బీజేపీ, పవన్ కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. పవన్ కూడా దేశం కోసం పని చేస్తున్నారు.. బీజేపీ కూడా దేశం కోసం పని చేస్తోంది కాబట్టి ఇద్దరి కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అని మాధవీలత తెలిపారు.

More News

చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడంటూ ట్విట్టర్‌ని షేక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. నాటి జనరేషన్ నుంచి నేటి జనరేషన్ వరకూ ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు.

రానా పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ దంపతులు..

ప్రముఖ సినీ నటుడు రానా వివాహం శనివారం రాత్రి 8:30 గంటలకు మిహీక బజాజ్‌తో జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహేష్ బర్త్ డే స్పెషల్‌గా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేష్‌కు విషెస్ చెబుతూ మైత్రి మూవీ మేకర్స్ ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

విజయవాడ కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

విజయవాడలో కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.