నా నలుగురు కెప్టెన్స్ వీళ్లే: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడు మీదున్నారు. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు మెగాస్టార్. ఈ సినిమా ఫైన‌ల్ స్టేజ్‌లో ఉండ‌గానే మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌ను ట్రాక్ ఎక్కించేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి నుండి లూసిఫ‌ర్ సినిమా మొద‌లు కానుంది. దీనికి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌కుడు. ఇది పూర్తి అయ్యే స‌మ‌యానికి త‌మిళ చిత్రం వేదాళం రీమేక్ స్టార్ట్ అవుతుంది. దీనికి మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ బాబీతో చిరంజీవి సినిమా చేయ‌బోతున్నారు ఈ విష‌యాన్ని చిరంజీవి మ‌రోసారి ఓ ఫొటోతో ధృవీక‌రించారు. కొర‌టాల శివ‌, మోహ‌న్‌రాజా, మెహ‌ర్ ర‌మేశ్‌, బాబీలో క‌లిసి ఉన్న ఫొటోను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన చిరంజీవి.. ‘నా నలుగురు కెప్టెన్స్ వీళ్లే.. ఫెంటాస్టిక్ 4 చార్ క‌ద‌మ్‌’ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ సిద్ధ అనే న‌క్స‌లైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, చిరంజీవి.. మాజీ న‌క్సలైట్‌గా, దేవాదాయ శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించే వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నారు.

More News

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన పవన్

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని అందజేశారు.

ఫిబ్రవరి 19న 'చెక్' రిలీజ్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది.

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

దుబాయ్‌లో సర్కారువారి పాట లాంగ్ షెడ్యూల్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమా స‌ర్కారు వారిపాట‌ కోసం దుబాయ్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

నాగ‌శౌర్య‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన 'లక్ష్య' టీజ‌ర్‌

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో