రాజమౌళిని డబ్బులు డిమాండ్ చేశారు...

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ స్థాయికి పెంచిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన బాహుబ‌లి-2 ఇప్పుడు 1500 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ఇండియా హయ్య‌స్ట్ గ్రాస‌ర్‌గా రేసులో దూసుకెళుతోంది. అయితే బాహుబ‌లి-2 విడుద‌ల త‌ర్వాత త‌మ‌కు బెదిరింపులు వ‌చ్చాయ‌ని, కొంద‌రు హ్య‌క‌ర్లు ఫోన్ చేసి తాము అడిగిన డ‌బ్బులు ఇవ్వ‌కుంటే సినిమాను నెట్‌లో పెడ‌తామ‌ని బెదిరించార‌ని రాజ‌మౌళి తెలిపారు.

ఈ బెదిరింపుల‌కు పాల్ప‌డిన సైబ‌ర్ నేర‌స్థుల‌ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందుతుల‌ను బీహార్‌లోని బిగుస‌రాయ్‌లో అరెస్ట్ చేశార‌ట‌. అయితే వీరి అరెస్టుకు బీహార్ పోలీసులు స‌హ‌క‌రించలేద‌ట‌. కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందుతులు ముందు క‌ర‌ణ్‌జోహార్‌ను డ‌బ్బు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్కామీడియాకు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు.

More News

జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవి 'మామ్'

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం

చైతు సినిమా సెన్సార్ పూర్తి...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

మూడు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న రారండోయ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

'అంధగాడు' ట్రైలర్ విడుదల

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఫ్యాన్స్ సమక్షంలో నిరాడంబరంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ.. అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు (మే 20).