‘సైరా’కు ‘సేనాని’తో పాటు.. ఆ ఇద్దరు స్టార్లు మాటసాయం!

  • IndiaGlitz, [Tuesday,August 20 2019]

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’. సినిమాకు సంబంధించిన పలు అప్డేట్స్ ఇచ్చిన చిత్రబృందం. ఈ సినిమాకు చిరు సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చారని సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చిన విషయం విదితమే. అంతేకాదు ఆయన చెప్పిన డైలాగ్ రిలీజ్ చేయడంతో ఇటు మెగాభిమానులు.. అటు జనసేన కార్యకర్తలు ఫిదా అయిపోయారు.

అయితే ‘సైరా’కు జనసేనానితో పాటు మరో ఇద్దరు స్టార్స్ మాటసాయం చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. తమిళ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్.. మళయాల స్టార్ మోహన్ లాల్ ఇద్దరూ వాయిస్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని భావించిన చిత్ర నిర్మాతలు చేయాల్సిన అన్ని ప్రయోగాలు చేసేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మల్లూవుడ్ స్టార్లను కీలక పాత్రల్లో పెట్టుకోవడం.. సోదరుడి స్వరం తీసుకోవడం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేసిన చిత్రబృందం చివరికి.. స్టార్ హీరోలైన రజనీకాంత్, మోహన్‌లాల్ మాట సాయం అందించడం మామూలు విషయం కాదు.

అంతేకాదు.. సైరాకు మీ వాయిస్ ఇవ్వాలి సార్ అని దర్శకనిర్మాతలు సంప్రదించగా.. మారు మాట చెప్పకుండానే రజనీ, మోహన్ లాల్ ఇద్దరూ డేట్స్ ఇచ్చేశారని తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే వాయిస్ ఇవ్వడానికి పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇటు దర్శక నిర్మాతలు గానీ.. అటు చిరు లేదా.. రజనీ, మోహన్ లాల్ రియాక్ట్ అవ్వాల్సిందే మరి. ఇదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులుండవని చెప్పుకోవచ్చు.

More News

‘సైరా’ టీజర్‌ రిలీజ్‌కు కౌంట్ డౌన్

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

కారు యాక్సిడెంట్... పరుగులు తీసిన హీరో రాజ్ తరుణ్

యువ హీరో రాజ్ తరుణ్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగి అల్కాపూర్ వద్దనున్న ఔటర్ రింగురోడ్డులో

జస్ట్ కన్ఫూజన్.. తరుణ్ కాదు.. రాజ్‌తరుణ్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, లవర్‌బాయ్‌గా పేరుగాంచిన తరుణ్‌‌‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని..

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

సీనియర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) గుండెపోటు కారణంగా ముంబైలో కన్నుమూశారు.

కంగారొద్దు.. తరుణ్‌కు ప్రమాదం జరగలేదు!

టాలీవుడ్ లవర్‌బాయ్ తరుణ్‌కు హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిందని.. ఆయనకు గాయాలయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.