త్రిష , హన్సికలతో మూడోసారి

  • IndiaGlitz, [Friday,November 13 2015]

యువ క‌థానాయ‌కుడు సిద్ధార్థ్‌కి తెలుగులో ప్ర‌స్తుతం మార్కెట్ లేక‌పోయినా.. త‌మిళంలో మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వ‌రుస విజ‌యాలు అత‌ని ఖాతాలోకి చేరుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ హీరో న‌టిస్తున్న చిత్రాల‌లో 'అర‌ణ్‌మ‌ణై 2' ఒక‌టి. తెలుగులో 'చంద్ర‌క‌ళ‌'గా వ‌చ్చిన 'అర‌ణ్‌మ‌ణై'కి సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష‌, హ‌న్సిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

విశేష‌మేమిటంటే.. ఈ ఇద్ద‌రితోనూ సిద్ధార్థ్ ఇదివ‌ర‌కు రెండేసి సినిమాలు చేశాడు. 'యువ‌', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' కోసం త్రిష‌తోనూ.. 'ఓ మై ఫ్రెండ్‌', 'స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్' కోసం హ‌న్సిక‌తోనూ సిద్ధు విడివిడిగా జ‌త‌క‌ట్టాడు. మూడోసారి విష‌యానికి వ‌చ్చేస‌రికి ఇద్ద‌రితోనూ ఒకే సినిమా కోసం క‌లిసి న‌టిస్తున్నాడు. అటు త్రిష‌తోనూ, ఇటు హ‌న్సిక‌తోనూ.. మొద‌టి ప్ర‌య‌త్నంలో ప‌రాజ‌యం.. రెండో ప్ర‌య‌త్నంలో విజ‌యం అందుకున్న సిద్దార్థ్‌కి మూడోసారి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

More News

చంద్రబాబును కలిసిన కమల్..

విలక్షణ చిత్రాలు, పాత్రలకు పెట్టింది పేరైన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏం చేసినా విలక్షణమే. నాలుగు దశాబ్దాల ఈ నటశిఖరం ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’ చిత్రంతో మెరవనున్నాడు.

భారీ రేంజ్ లో 'సైజ్ జీరో' ప్రమోషన్స్

సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన చిత్రం ‘సైజ్ జీరో’.అనుష్క,ఆర్య,సోనాల్ చౌహాన్ ప్రధానతారాగణం.‘బాహుబలి’,‘రుద్రమదేవి’చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన చిత్రం‘సైజ్ జీరో’

'సుప్రీమ్ ' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

‘పిల్లా నువ్వులేని జీవితం’,‘సుబ్రమణ్యం ఫర్ సేల్’చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రారంభమైన ‘సుప్రీమ్’ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది.

నిఖిల్ ' శంకరాభరణం ' సెన్సార్ పూర్తి డిసెంబర్ 4న విడుదల

స్వామి రారా, కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ,ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ''శంకరాభరణం''.

కొట్టుకునేంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది - అఖిల్ సక్సెస్ మీట్ లో నాగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడోతరం యువ కధానాయకుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అఖిల్,సయేషా జంటగా నటించారు.