పాపనాశం 2: పాతికేళ్ల తర్వాత కమల్ తో.. గౌతమి ప్లేస్ లో ఆమె..

  • IndiaGlitz, [Wednesday,June 16 2021]

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇటీవలే దృశ్యం 2 కూడా మలయాళంలో విడుదలయింది. మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం 2 ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది.

ఇదీ చదవండి: హీరోతో సమానంగా.. 'రంగస్థలం' నటుడికి బంపర్ ఆఫర్?

తెలుగులో దృశ్యం 2 రీమేక్ ఇప్పటికే ప్రారంభం అయింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు.మొదటి భాగంలో వీళ్లిద్దరే నటించారు. తమిళ రీమేక్ కు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. తమిళంలో తొలి భాగాన్ని 'పాపనాశం' గా తెరకెక్కించారు. ఇందులో కమల్ హాసన్, ఆయన మాజీ పార్ట్నర్ గౌతమి నటించారు.

పాపనాశం 2015 లో విడుదలయింది. ఆ సమయంలో కమల్, గౌతమి కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. కాబట్టి పాపనాశం 2లో ఆమె నటించడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీనితో దర్శకుడు జీతూ జోసెఫ్ పాపనాశం 2లో కమల్ కి జోడిగా మీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పాతికేళ్ల తర్వాత కమల్ తో మీనా నటించినట్లు అవుతుంది.

1996లో మీనా 'అవ్వై షణ్ముఖి' చిత్రంలో కమల్ తో కలసి నటించింది. 13 ఏళ్ల పాటు సహజీవనం చేసిన కమల్, గౌతమి 2016లో వ్యక్తిగత విభేదాల వల్ల విడిపోయారు.

More News

హీరోతో సమానంగా.. 'రంగస్థలం' నటుడికి బంపర్ ఆఫర్?

సపోర్టింగ్ రోల్స్ చేసే నటులకు హీరోలతో సమానంగా పాత్ర దొరకడం చాలా అరుదుగా ఉంటుంది.

స్టన్నింగ్ హాట్: పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక

సౌత్ లో రష్మిక మందన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక..

'సోనీ లివ్' తెలుగు కంటెంట్ హెడ్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత

కరోనా ప్రభావంతో ఓటిటి లకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్స్ లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినీ అభిమానులు ఓటిటి లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైరల్ పిక్స్: పూజా హెగ్డేతో ఫోటో.. సిగ్గు పడిపోతున్న కొరటాల శివ

పూజా హెగ్డేతో ఫోటో దిగేందుకు కొరటాల శివ సిగ్గు పడడం ఏంటి అనుకుంటున్నారా. అవును ఇది నిజం.

ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు.. జరిగిన తప్పుకు క్షమించండి: హైపర్ ఆది

బుల్లితెర హాస్య నటుడు హైపర్ ఆది తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు.