close
Choose your channels

పాపనాశం 2: పాతికేళ్ల తర్వాత కమల్ తో.. గౌతమి ప్లేస్ లో ఆమె..

Wednesday, June 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాపనాశం 2: పాతికేళ్ల తర్వాత కమల్ తో.. గౌతమి ప్లేస్ లో ఆమె..

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇటీవలే దృశ్యం 2 కూడా మలయాళంలో విడుదలయింది. మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం 2 ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది.

ఇదీ చదవండి: హీరోతో సమానంగా.. 'రంగస్థలం' నటుడికి బంపర్ ఆఫర్?

తెలుగులో దృశ్యం 2 రీమేక్ ఇప్పటికే ప్రారంభం అయింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు.మొదటి భాగంలో వీళ్లిద్దరే నటించారు. తమిళ రీమేక్ కు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. తమిళంలో తొలి భాగాన్ని 'పాపనాశం' గా తెరకెక్కించారు. ఇందులో కమల్ హాసన్, ఆయన మాజీ పార్ట్నర్ గౌతమి నటించారు.

పాపనాశం 2015 లో విడుదలయింది. ఆ సమయంలో కమల్, గౌతమి కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. కాబట్టి పాపనాశం 2లో ఆమె నటించడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీనితో దర్శకుడు జీతూ జోసెఫ్ పాపనాశం 2లో కమల్ కి జోడిగా మీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పాతికేళ్ల తర్వాత కమల్ తో మీనా నటించినట్లు అవుతుంది.

1996లో మీనా 'అవ్వై షణ్ముఖి' చిత్రంలో కమల్ తో కలసి నటించింది. 13 ఏళ్ల పాటు సహజీవనం చేసిన కమల్, గౌతమి 2016లో వ్యక్తిగత విభేదాల వల్ల విడిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.